Director Teja: వైరల్ అవుతున్న దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు!

Director Teja: తెలుగు సినిమా ప్రేక్షకులకు డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా తేజ సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా హైలైట్ అవుతూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా కూడా కుండలు బద్దలు కొట్టినట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు తేజ. ఈ మధ్యకాలంలో డైరెక్టర్ తేజ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా తేజ దర్శకత్వం వహించిన సినిమా అహింస. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు తేజ. రానా సోదరుడు అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

రజిత బేడీ, గీతికతివారి, సదా,రవికాలే,కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. కాగా ఈ సినిమా జూన్ 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తేజ బ్యాక్ టు బ్యాక్‌ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. మరొక వైపు ప్రెస్ మీట్ లు కూడా నిర్వహిస్తున్నారు. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ తన కూతురు, కొడుకు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకును త్వరలోనే హీరోగా పరిచయం చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు తేజ. అలాగే కూతురి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగివచ్చింది. నేను ఆమెకు పెళ్లి చేయను నచ్చినవాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను.

 

ఒకవేళ పెళ్లయ్యాక భర్తతో పడకపోతే విడాకులు తీసుకోమని కూడా చెప్పాను. మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది అనవసరం. ఇదే విషయాన్ని నా పిల్లలకు కూడా నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను అంటూ తేజ బోల్డ్ గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తేజ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది తేజకి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు మాత్రం తేజ ని తిట్టిపోస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -