Manchu brothers: మనోజ్ పెళ్లి విష్ణుకు ఇష్టం లేదా.. అందుకే ఇలా ప్రవర్తించారా?

Manchu brothers: టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది మంచు ఫ్యామిలీనే అని చెప్పవచ్చు. తరచూ ఏదో ఒక విషయంతో మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూనే ఉంటారు. మరి ముఖ్యంగా మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. ఇక మంచు విష్ణు పై అయితే దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.

 

ఇది ఇలా ఉంటే తాజాగా మంచి ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి. మంచు మనోజ్ మంచు విష్ణుల మధ్య చాలా కాలంగా ఉన్న వివాదం తాజాగా నడిరోడ్డున పడింది. అయితే గత కొంతకాలంగా మంచు మనోజ్ మంచు విష్ణువుల మధ్య మాటలు సరిగా లేవని ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని, అందుకే మంచు మనోజ్ మంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విష్ణు బర్త్ డే సందర్భంగా మనోజ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపినప్పటికీ మంచు విష్ణు స్పందించలేదు.

అలాగే ఇటీవల మంచు మనోజ్ పెళ్లి జరగగా ఏదో అతిధుల ఉంటూ ఆ పెళ్ళికి తనకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించారు పంచు విష్ణు. దాంతో నెటిజన్స్ మంచు విష్ణుని ఏకి పారేసిన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవం సమయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. విష్ణు మనోజ్ ఇద్దరూ ఒకే స్టేజిపై ఉన్నప్పటికీ ఇద్దరు ఒకరు పలకరించుకోలేదు.. ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరో ఎత్తు అని చెప్పవచ్చు. మంచు మనోజ్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి విష్ణు గొడవ పడడం ఆ వీడియోస్ స్వయంగా మనోజ్ షేర్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

నిజానికి మంచు మనోజ్ మంచు విష్ణు ఇద్దరు సొంత అన్నదమ్ములు కాదు. మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవికి విష్ణు లక్ష్మీ సంతానం. ఆమె చనిపోయిన తర్వాత విద్యా దేవి సొంత చెల్లెలు నిర్మల దేవిని రెండవ వివాహం చేసుకున్నారు మోహన్ బాబు. వీరికి పుట్టిన సంతానమే మంచు మనోజ్. అయినప్పటికీ మంచు లక్ష్మి మనోజ్ తో చాలా క్లోజ్ గా ఉండేది. మొన్నటికి మొన్న మంచు మనోజ్ పెళ్లిలో అన్ని తానై దగ్గరుండి చూసుకుంది మంచు లక్ష్మి. మరి నీ గొడవ విషయంలో మంచు లక్ష్మి కలుగజేసుకుంటుందా ఇద్దరి మధ్య ఉన్న గొడవలను సామరస్యంగా పరిష్కరిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -