Sreemukhi-Pradeep: వాట్.. శ్రీముఖి ని స్టార్ యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

Sreemukhi-Pradeep: ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్న విషయం ఏదైనా ఉంది అంటే.. అది యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయం. ప్రదీప్ పెళ్ళికి సిద్ధమయ్యాడని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర షోలతో దాదాపుగా హీరోల మాదిరి ఫేమస్ అయిన ప్రదీప్ కు మంచి పాపులారిటీ ఉంది. ఇక ప్రదీప్ పెళ్లి గురించి కూడా ఎప్పటి నుండో చర్చ జరుగుతుంది. ఇక ఇటీవల ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ ఐపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

తన పాపులారిటీతో దాదాపుగా ప్రతి ఇంటా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్.. టాలీవుడ్ బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించాడు. ఈ క్రమంలో తనతో పాటు చాలా షోలలో యాంకరింగ్ చేసిన శ్రీముఖిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడని వార్తలు వినిపించాయి. ఇక ప్రదీప్ శ్రీముఖి కలిసి చాలా ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అలా కలిసి ఆడి పాడి, గంతులేశారు, చిందులేశారు. ఇదిలా ఉండగా కొన్ని ఈవెంట్స్ లో అయితే శ్రీముఖి మరియు ప్రదీప్ కలిసి జంటగా చేయగా వారి మధ్య కెమిస్ర్టీ బాగా వర్క్ అవుట్ అయ్యింది కూడా.

ఈ క్రమంలోనే ప్రదీప్ తల్లి శ్రీముఖిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశ పడిందట. ఈ వార్తపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. గతంలో వీళిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రదీప్, శ్రీముఖి లు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రదీప్ వాళ్ళ అమ్మ ఆశ పడిందట. ఇక శ్రీముఖి అప్పటికే వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉండగా.. ప్రదీప్ కు సున్నితంగా నో చెప్పినట్టు టాక్ నడుస్తోంది. దీనితో ప్రదీప్ కూడా తనను లైట్ తీసుకున్నట్టు టాక్.

టీవీ షోలలో వీళ్ళు చేసిన పర్ఫామెన్స్ తో.. బుల్లితెర పై వీళ్లు క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. వీరి యాంకరింగ్ తో TRP రేటింగ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ బాగుండటంతో అభిమానులు కూడా వీరు ఒక్కటైతే బాగుంటుందనే అనుకున్నారు. కానీ ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై అటు ప్రదీప్, ఇటు శ్రీముఖి ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -