Marriage: మన భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ల మధ్య బంధానికి ఎంతో విశిష్టత ఉంది. తోడబుట్టిన వాళ్లు కాకపోయినా కూడా వరుసకు అన్నా చెల్లెలు అయితే కడవరకు వారు ఆ బంధానికి కట్టుబడి ఉండాలి. అయితే ఇప్పుడు ఈ పవిత్రమైన బంధాన్ని ఒక జంట మంట కలిపారు. ఇంతకాలం అన్నా, చెల్లి గా ఉన్న వీరు ఇప్పుడు భార్య భర్తలు అయ్యారు. వీరి విచిత్ర ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విని, జై అనే యువతి యువకులు చిన్న నాటి నుండి స్నేహితులు. అయితే వీరిద్దరూ ఇప్పుడు వివాహం చేసుకొని భార్యాభర్తలుగా సంతోషమైన జీవితం కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి విని, జై తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమ వ్యక్తిగత విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆ విషయాలు తెలుసుకున్న నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.విని జై ని చిన్నప్పటినుండి అన్నయ్య అని పిలిచేది. చిన్నప్పుడు స్నేహితులుగా ఉన్నప్పటికీ పెద్దయ్యాక స్నేహం కొనసాగించలేక పోయామని వెల్లడించారు. అయితే జై తనకు దూరపు చుట్టం అవటంతో చిన్నప్పటినుండి అన్నయ్య అని పిలిచేదానినని, అయితే ఆ బంధం స్నేహంగా మారి ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని యువతి వెల్లడించింది.
ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహం చేసుకొని ఒక్కటైనట్లు యువతి తెలిపింది. ప్రస్తుతం వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా ఉన్నట్లు వెల్లడించింది. అయితే వీరి ప్రేమ గురించి తెలుసుకున్న నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. చిన్నప్పటి నుంచి అన్నయ్య అని పిలిచి ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడం ఏంటి విడ్డూరం కాకపోతే అంటూ కామెంట్లు
చేస్తున్నారు.