Pushpa 2: పుష్ప2 విషయంలో బాహుబలి2 స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

Pushpa 2: టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న మూవీ పుష్ప 2. ఇందులో అల్లు అర్జున్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ విడుదలైన పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

కాగా పుష్ప 1 లో క్లైమాక్స్ ని ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు సుకుమార్. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే భీకరమైన సన్నివేశంతో సినిమా ముగుస్తుంది. షెకావత్ కు అదిరిపోయే రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు పుష్ప. దీంతో పుష్పరాజ్ పై షెకావత్ పగ తీర్చుకోవడం, పుష్పరాజ్ దాన్ని ఎలా తిప్పికొట్టాడనేది పార్ట్ 2లో బేసిక్ పాయింట్. ప్రస్తుతం దానికి ఊతమిస్తూ, ఒక చిన్న పాయింట్ ని రివీల్ చేశారు మూవీ మేకర్స్. సినిమాలో పుష్పరాజ్ అరెస్ట్ అవుతాడు, ఆ వెంటనే తప్పించుకుంటాడు. అతడికి బుల్లెట్ గాయాలు కూడా అవుతాయి.

 

అయితే పుష్పరాజ్ ఎక్కడున్నాడనే విషయాన్ని ఎవ్వరూ కనిబెట్టలేకపోయారు. అసలు పుష్ప ఎక్కడ అనే ఇంట్రెస్టింగ్ లాక్ తో వీడియోను ముగించారు. దీనికి కొనసాగింపుగా మరింత సమాచారం కావాలంటే 7వ తేదీ సాయంత్రం 4:05 నిమిషాల వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజున ఇంకొంచెం ఎక్కువ నిడివి ఉన్న వీడియోను విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. అయితే ఇదంతా చూస్తుంటే బాహుబలి2 స్ట్రాటజీని పుష్ప 2 కోసం ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే హుక్ లైన్ ఆ సినిమాకు బాగా పనికొచ్చింది. అదే విధంగా వేర్ ఈజ్ పుష్ప అనే హుక్ లైన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -