Shwetarka Ganapati: త్వరలో వినాయచవితి పండుగ వస్తుంది. వినాయచవితి అంటేనే అందరిలో ఉత్సాహం వస్తుంది. అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవారు వారు పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగ దగ్గర పడుతుందంటే చాలు.. నెల రోజుల ముందు నుంచే ప్లాన్ వేసుకుంటారు. గణపతి విగ్రహాన్ని తీసుకురావడానికి చందాలు కలెక్ట్ చేస్తారు. ఇక విగ్రహల ద్వారా యువతీయువకుల సందడితో పండుగ శోభ కనిపిస్తుంది. వినాయకచవితి వచ్చిందంటే.. ప్రతి వీధిలో వినాయకుడి విగ్రహలు దర్శనమిస్తాయి. అక్కడ భక్తుల సందడితో కోలాహలంగా కనిపిస్తుంది.
వినాయకుడి విగ్రహం పెట్టినప్పటి నుంచి నిమజ్జం చేసేవారు సందడి వాతావరణం కనిపిస్తుంది. డప్పులతో , యువతీయువకు సందడితో ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇక వినాయకచవితికి చాలాలమంది ఇంట్లోనే చిన్న చిన్న వినాయకుడి ప్రతిమలను పెట్టుకుని పూజలు చేస్తారు. అయితే తెల్ల జిల్లేడుతో తయారుచేసిన వినాయకుడి ప్రతిమ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. తెల్ల జిల్లేడుతో తయారుచేసిన వినాయకుడి ప్రతిమను ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని హిందూవుల నమ్మకం. ఇలా పూజలు చేస్తే సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని హిందూవులు విశ్వసిస్తారు.
శ్వేతార్క వినాయకుడిని పూజించేవారు మంచి ముహూర్తం చూసుకుని ఇంట్లో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. శుభ్రంగా కడిగిన ఎర్రని వస్త్రంపై ఉంచి ధూపదీప వైవేధ్యాలతో పూజించాలని పండిుతులు సలహ ఇస్తున్నారు. ఇంట్లో పెట్టుకునేప్పుడు పండితుల సలహాల తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పండితుల సలహ మేరకే ఇంట్లో ప్రతిష్టించుకోవాలని అంటున్నారు.
హిందూ దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్ల అందరికంటే ముందే పూజలు అందుకేను దేవుడు వినాయకుడు. ఏదైనా పని మొదలుపెట్టే సమయంలో తొలుత వినాయకుడికి పూజలు చేసి ప్రారంభించారు. అంతగా హిందూ దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు