Shani: శని దోషమా.. విఘ్నేశ్వరుడికి ఇలా పూజ చేయండి?

Shani: ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో శని దోషాలు, శని ప్రభావం ఉండనే ఉంటుంది. ఇక అటువంటి సమయంలో చాలామంది అనేక రకాల పూజలు చేయడంతో పాటు దానధర్మాలు చేస్తూ ఉంటారు. అవన్నీ చేయడం వల్ల శని దోషం పోతుంది అన్న విషయం వాస్తవమే కానీ శని బాధ నుంచి తొందరగా నివారణ పొందడానికి వినాయక ఆరాధన చేయడం మంచిది. మరి వినాయకుడిని ఏ విధంగా పూజించడం వల్ల శని దోషం పోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వినాయకుడికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి.

ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనిశ్వరుడు వలన కలిగే ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడవచ్చు. శని ని శనివారం రోజు గరికతో పూజించడం వల్ల ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. అలాగే గరికపత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు కూడా త్వరగా నేరవేరుతాయి. ఆ గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దుర్గాదేవిని గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి.

 

గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. గరికతో గణేష్డుని ఆరాధించి అతి శ్రీఘ్రంగా శనిబాధల నుంచి విముక్తి పడవచ్చు. ఈ విధంగా విఘ్నేశ్వరుడిని గరికతో భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని దోషం పోతుంది. అలాగే గణేష్ ని పూజించడం వల్ల అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా నెరవేరుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -