YSRCP: వచ్చే ఎన్నికలలో టీడీపీ,జనసేన పొత్తు ఖాయం అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక మిగిలిందల్లా ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడమే. ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక ప్రభావంతో పాటు జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు జిల్లాలలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు అయితే తాము ఖచ్చితంగా ఓడిపోతున్నాం అన్న అంచనాకు వచ్చేసినట్టే కనిపిస్తోంది.
ఈ విషయంపై వారు తమ అంతర్గత చర్చలలో కూడా చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాలతో పాటు అందులోని విశాఖ జిల్లాలో ఈ పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన,టీడీపీ దెబ్బతో వైసీపీ చిత్తుచిత్తు అవుతుందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే తాము గెలవడం అనేది కలలో మాట అని చెప్పుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఇప్పటికే రాజధాని ప్రభావంతో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. దీనికి తోడు ఈ రెండు పార్టీల పొత్తు దెబ్బతో వైసీపీ నేతల్లో భయం కూడా మొదలైందని చెప్పవచ్చు.
ఇక శ్రీకాకుళం నుంచి రెండు గోదావరి జిల్లాలు, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 55 నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ పొత్తు ఎఫెక్ట్తో ఘోరంగా ఓడిపోనున్నారు. అయితే గత ఎన్నికల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసిన ప్రభావంతో 1000 నుంచి 2,3 వేల ఓట్ల తేడాతో చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది. అయితే ఈ సారి వాళ్లందరూ భారీ మెజార్టీలతో ఘనవిజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ ఘోరంగా 55 నియోజకవర్గాలలో ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.