NTR Nayanatara: నయనయతార జాతకాన్ని ముందే ఊహించని జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే? 

NTR Nayanatara: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార విగ్నేష్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు పూర్వీకుల ఆశీస్సులతో తామిద్దరం తల్లిదండ్రులకు అయ్యామని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చాము. వీరికి మీ ఆశీర్వాదాలు కూడా కావాలంటూ విగ్నేష్ శివన్ వారికి పిల్లలు జన్మించిన విషయాన్ని తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నయనతార విగ్నేష్ పెళ్లి జరిగి నాలుగు నెలలు పూర్తిగా అయింది. అయితే వీరికి పిల్లల పుట్టడం ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సరోగసి పద్ధతి ద్వారా పెళ్లి కాకముందే వీరిద్దరూ పిల్లల్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంతో ఈ జంట ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే నయనతారకు ఇద్దరు కవల పిల్లలు పుడతారని జూనియర్ ఎన్టీఆర్ గతంలో జాతకం చెప్పారు. అయితే ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే… వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం అదుర్స్ ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించారు. అలాగే హీరోయిన్ గా నయనతార కూడా నటించారు.ఇందులో చారి పాత్రలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ను నయనతార వివాహం చేసుకుంటారు. ఇలా ఎన్టీఆర్ ఈ సినిమాలో కవలలుగా జన్మించి ఉంటారు.
ఎన్టీఆర్ నయనతారను పెళ్లి చేసుకున్న తర్వాత తన జాతకంలో కూడా ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు సుమీ అంటూ సినిమాలో డైలాగ్ చెబుతారు.ఈ సినిమాలో నయనతారకు ఇద్దరు పిల్లలు పుట్టినట్టు కూడా చూపించారు. అయితే ఆరోజు సినిమాలో నయనతారకు ఇద్దరు కవల పిల్లలని ఎన్టీఆర్ జాతకం చెప్పగా నయనతార నిజజీవితంలో కూడా ఇద్దరు కవల పిల్లలు జన్మించడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -