Venu Swamy: వాళ్లిద్దరి విషయంలో వేణుస్వామి జాతకం నిజమవుతుందా?

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలిసిందే. రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల జాతకాలు, జరగబోయే పరిణామాలు ముందుగానే చెబుతూ పాపులర్ అయ్యారు వేణు స్వామి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి వారు వెంటనే కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాటికి పరిష్కారాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు వేణు స్వామి.
సినీ ఇండస్ట్రీ గురించి, రాజకీయ నేతల గురించి అప్పుడప్పుడు సంచలన విషయాలు చెబుతూ ఉంటారు వేణు స్వామి. నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంటారని చెప్పిన ఆయన.. తర్వాత చాలా మంది ప్రముఖుల జీవితాల్లో జరగబోయే విషయాలు చెబుతూ వస్తున్నారు. నయనతార, రష్మిక, ప్రభాస్ జీవితాల్లో జరగబోయే వాటి గురించి కూడా చెప్పారు.
వేణు స్వామి చెప్పిన వాటిలో చాలా వరకు జరుగుతుండడంతో ఈయన చెప్పే మాటలను ప్రజలు బాగా నమ్ముతున్నారు. అయితే, ఇటీవల వేణు స్వామి మరో సంచలనం ప్రకటించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ గా ఉన్న ఇద్దరు వ్యక్తులు త్వరలోనే చనిపోతారని బాంబ్ లాంటి వార్త చెప్పాడు. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇందంతా మార్కెట్ పెంచుకోవడానికే..
వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు నిజమో కాదో పక్కన బెడితే.. అతను మార్కెట్ పెంచుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. సమంత, నాగచైతన్య వ్యవహారమైనా.. ఇతర ఏ సంచలన అంశాలైనా ఈ తరహా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఎవరో చనిపోతారనే వ్యాఖ్యలతో తన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -