Akhil Akkineni: ప్రభాస్‌కు ఉన్న తెలివి అఖిల్‌కు లేకుండా పోయిందా?

Akhil Akkineni: టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున కొడుకు అఖిల్ హీరోగా అందరికీ సుపరిచితమే. ఆయన ‘అఖిల్’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖిల్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. అలాగే ఈ సంక్రాంతి బరిలోకి అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా విడుదల వాయిదా పడనుందనే సమాచారంతో ఆ సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు పెద్దగా లేవనే చెప్పాలి మరి. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌పై మంచి స్పందన వచ్చినప్పటికీ చివర్లో డియో గేమ్‌ను తలిపించిందనే నెటిజన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి.

 

 

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, అఖిల్ లుక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వాస్తవానికి ఈ మూవీకి భారీ బడ్జెట్ పెడుతున్నారని, అఖిల్ మార్కెట్‌కు మించి రెండింతలు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్ కోసం సురేందర్ రెడ్డి భారీ సెట్స్, అబ్రోడ్ షూట్ ఇలా చాలానే ప్లాన్ చేస్తున్నారంట. ఈ చిత్రానికి ముందుగా బడ్జెట్ ఎప్పుడో దాటేసిందని తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ ఇద్దరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరు నిర్మాతలు పారితోషికం లేకుండా పనిచేస్తున్నారు.

 

ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అఖిల్ ఈ సినిమా విడుదల అయినా తర్వాతే పారితోషికం ఇవ్వమని నిర్మాతకి చెప్పారట. అలా ఆ ప్రాజెక్ట్ కు సైన్ కూడా చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సంక్రాంతి బరిలోకి వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు రానున్నాయి. వీరిద్దరి సినిమా మధ్యలోకి అఖిల్ సినిమా విడుదల కానుంది. దీంతో అఖిత్ ‘ఏజెంట్’ సరైన విజయాన్ని అందుకోలేదేమోనని సినీ వర్గాలు భావిస్తున్నారు. కానీ ఈ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాలని ఆశిద్దాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -