Samantha: నాకు మొండితనం ఎక్కువ.. డిసైడ్ అయ్యా: సమంత

Samantha: హీరోయిన్ సమంతకు ఆరోగ్యం బాగోలేదనే విషయం అందరికీ తెలుసు. సమంత గతకొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి అందరి మధ్యకు రావాలని, మంచి సినిమాలు చేయాలని అందరూ ఆకాంక్షించడం తెలిసిందే.

 

 

సమంత హీరోయిన్ గా చేసిన ‘యశోద’ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో.. ఆమె ఓ ఇంటర్వ్యూ ద్వారా అందరి ముందుకు వచ్చింది. యశోద టీం సదరు ఇంటర్వ్యూను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. అందులో సమంత తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా వివరించింది.

 

 

తన జీవితంలో కష్టాలు వచ్చాయని.. యశోద సినిమాలో మాదిరిగా తాను కూడా వాటిపై పోరాడుతున్నట్లు హీరోయిన్ సమంత వివరించింది. అలాగే తాను కూడా సినిమా మాదిరిగా మనగలనని కూడా చెప్పింది. తనకు మొండితనం ఎక్కువని.. అందుకే తాను పోరాడాలని డిసైడ్ అయినట్లు సమంత వివరించింది. తనలాగా ఎంతోమంది సైలెంట్ గా పోరాటం చేస్తున్నారని సమంత తెలిపింది.

 

 

జీవితం అనుకున్నంత సులభం కాదని, చాలా పోరాడాల్సి వస్తుందని సమంత వివరించింది. తాను కూడా కష్టపడుతున్నానని, దేవుడు ఎలాంటి డిసైడ్ చేస్తే అలా జరుగుతుందని చెప్పింది. భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి యాంకర్ సుమ ప్రశ్నించగా.. మన చేతిలో ఏమీలేదని, అంతా దేవుడి చేతిలోనే ఉందని, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడకూడదని అనుకున్నట్లు సమంత వివరించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -