Samantha-Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఓ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె ఆ ప్రకటన చేసినప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే నాగార్జున, నాగ చైతన్య కూడా ఈ విషయంపై స్పందించారు. హీరో నాగ చైతన్య ఆమెను హాస్పిటల్కు వెళ్లి కలిసినట్లు, తనను ఓదార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అనారోగ్యంతో బాధపడుతున్న సమంతకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత-నాగ చైతన్యల విడాకులు కూడా రద్దు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సమంత ఆరోగ్య పరిస్థితిపై చలించిన నాగ చైతన్య.. ఆమె ఓదార్చినట్లు.. అలాగే ఆమె తల్లిదండ్రులతో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి విడాకులు కూడా రద్దు చేసేందుకు నాగార్జున సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమంతకు దగ్గరగా ఉండాలని, ఆమెకు తోడుగా ఉండాలని చెబుతూ నాగ చైతన్యకు సూచించినట్లు సమాచారం.
అయితే సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఇదంతా పుకార్లేనని చెప్పుకొచ్చారు. సమంత అనారోగ్యంపై నాగ చైతన్య, నాగార్జున ఎలాంటి పరామర్శ, ఫోన్ కాల్ కానీ చేయలేదన్నారు. విడాకుల రద్దు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదన్నారు. కాగా, మరో వైపు సమంత-నాగ చైతన్య అభిమానులు కూడా ఇద్దరూ ఒకటవ్వాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇద్దరూ ఒకరికొకరు సపోర్టుగా నిలబడాలని సూచిస్తున్నారు. దానికి నాగచైతన్య కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం సమంత ‘యశోద’ సినిమా ప్రయోషన్స్ లో బిజీగా ఉంటోంది. నవంబర్ 11వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. సమంత నేరుగా ప్రయోషన్స్ లో పాల్గొనప్పటికీ.. యాంకర్ సుమతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలను తెలియజేస్తూ.. ఏమోషనల్ అయిన విషయం తెలిసిందే.