Mahesh Babu: తల్లిపై ప్రేమను చాటుకుంటున్న మహేష్.. గొప్ప కొడుకు అంటూ?

Mahesh Babu: తెలుగులో బాలీవుడ్ హీరోల కన్నా అందగాడిగా పేరున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబు.. ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి రావడం తెలిసిందే. సినిమాల్లో ప్రస్తుతం తనంకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకోవడం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను కూడా రాబట్టింది.

 

ఇక మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగా మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. దీంతో కుదేలైైపోయిన మహేష్ బాబు.. ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించాడు. ఆ తర్వాత చేయాల్సిన కొన్ని కార్యక్రమాలను ముగించుకొని, విదేశాలకు వెళ్లిపోయాడు. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాకు బ్రేక్ ఇచ్చి మరీ విదేశాలకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు.

 

అయితే తన తల్లి ఇందిరా దేవి మీద ఎంతో ప్రేమను కలిగి ఉన్న మహేష్ బాబు.. ఆమె చివరి కోరిక కోసం ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడనే చర్చ నడుస్తోంది. మహేష్ బాబు కూతురు సితారకు ఓణీల ఫంక్షన్ చేయాలని ఇందిరా దేవి చాలా కాలంగా కోరుతూ వస్తోందట. అయితే ఇది ఏమాత్రం ఇష్టం లేని మహేష్.. దానిని నిర్వహించకుండా దాటవేస్తూ వచ్చాడట. కానీ ఇందిరా దేవి తన చివరి కోరికగా సితార ఓణీల ఫంక్షన్ చేయాలని కోరిందట.

 

దీంతో ఇష్టం లేకపోయినా మహేష్ బాబు ఇప్పుడు తన కూతురు సితారకు ఓణీల ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చాడట. విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఓణీల ఫంక్షన్ కు సంబంధించిన పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతో తల్లి చివరి కోరిక కోసం మహేష్ తనకు ఇష్టం లేకపోయినా ఇలా చేస్తున్నాడని, తల్లి అంటే మహేష్ అంత ప్రేమ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -