Rakul: తెలుగు సినీ పరిశ్రమలో యాక్టర్ కమ్ డైరెక్టర్ చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి టాలెంటెడ్ సెలబ్రిటీల్లో రాహుల్ రవీంద్రన్ ఒకరు. ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని పెళ్లి చేసుకున్న తర్వాతే రవీంద్రన్ పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. ఎందుకంటే ఆమెను అప్పటికే చిన్మయి బుల్లి తెరపై అలరిస్తోంది. కానీ రవీంద్రన్ అప్పటవరకు ఇండస్ట్రీలోకి రాలేదు. వచ్చిన తర్వాత కూడా అంత పాపులారిటీ పొందలేపోయాడు. కానీ చిన్మయి లైఫ్లోని రాహుల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అతని కెరీరే మారిపోయింది. ‘అందాల రాక్షసి, సైడ్ రోల్, ఒకటి ఆరా’ వంటి సినిమాల్లోనే నటించారు. ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో రాహల్ దర్శకత్వం వైపు అడుగు వేశాడు.
అయితే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే అప్పటివరకు టాలీవుడ్లో స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోలతో నటించింది. తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీలో రకుల్కు అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ వార్త వైరల్ అయింది.
తాజాగా సోషల్ మీడియాలో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న రిలేషన్పై పుకార్లు వెల్లవెత్తుతున్నాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు సంబంధించిన అవార్డును చూపిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఓ పోస్టు పెట్టింది. దానికి రాహుల్ రవీంద్రన్ రియాక్ట్ అయి శుభాకాంక్షలు తెలియజేశాడు. దానికి రకుల్ ‘థాంక్యూ బడే భయ్యా’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. రకుల్-రాహుల్ రవీంద్రన్కు మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉందని నెట్టంట చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరి మధ్య ఈ బంధం ఎలా ఏర్పడిందనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే గంతో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు-2’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోగా నాగార్జున, హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్కు అవకాశాలు తగ్గాయి.