Tollywood: ఆంధ్రా కుర్రాళ్లు అమాయకులా.. ఈ మూవీ ట్రైలర్ చూశారా?

Tollywood: తెలుగులో ఈ మధ్యన మంచి కంటెంట్ ఉన్న, యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. సినిమా చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నచ్చిందంటే జనాలు దానిని ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర ట్రైలర్ ఓ సినిమా మీద అంచనాలను పెంచుతోంది.

 

టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ మహరాజ రవితేజ నిర్మాతగా మారుతున్నాడు. కోలీవుడ్ లో తాను నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిలతో కలిసి నటిస్తున్న ఓ సినిమాతో రవితేజ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు.

 

చెల్లా అయ్యువు దర్శకత్వంలో ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మట్టి కుస్తి’. అందరితో గొడవలు పెట్టుకునే ఓ కుర్రాడు.. ఎంతో అణుకువగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతడికి కేరళకు చెందిన కుస్తీ పట్టే అమ్మాయి సెట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్లకు పెళ్లి అవడం, మగాళ్ల ముందు అమ్మాయిలు ఏం తక్కువ అన్నట్లు భార్య ఉండటం లాంటి ఇంట్రస్టింగ్ అంశాలతో ‘మట్టి కుస్తి’ ట్రైలర్ వచ్చింది.

 

ట్రైలర్ లో వచ్చే కామెడీ డైలాగులు అందరినీ అలరిస్తున్నాయి. ఆంధ్రా కుర్రాళ్లు అమాయకులు, శోభనం అయ్యాక ప్రతి మగాడి జీవితం ఫసక్కే అనే డైలాగులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో డిసెంబర్ 2న విడుదల అయ్యాక చూడాలి.

 

Matti Kusthi – Official Trailer | Vishnu Vishal | Aishwarya Lekshmi | Chella Ayyavu | Ravi Teja – YouTube

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -