Jeevitha: జీవితకు భారీ షాకిచ్చిన మోసగాడు.. జియో ఆఫర్ అంటూ?

Jeevitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించిన హీరోల జాబితాలో ఒకప్పటి స్టార్ రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు ఉన్న రాజశేఖర్.. ఒకప్పుడు పోలీస్ సినిమాలకు, ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ గా ఉండేవారు. రాజశేఖర్, తన సహ నటి అయిన జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

 

నటిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా జీవిత రాజశేఖర్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. టాలీవుడ్ లో జరిగే మా ఎన్నికలతో సహా చాలా విషయాల్లో జీవితా రాజశేఖర్ ఎంతో యాక్టిగ్ గా ఉంటుంది. అలాంటి జీవిత రాజశేఖర్ గుడ్డిగా మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జియో ఆఫర్ అంటూ ఆమెను ఓ వ్యక్తి ముంచిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

జీవిత రాజశేఖర్ ఎలా మోసపోయిందంటే?:

జీవిత రాజశేఖర్ కు గుర్తు తెలియన ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీ ఇంటికి జియో కనెక్షన్ ఇచ్చింది నేనే అంటూ షారుఖ్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. జీవిత రాజశేఖర్ తన ఫోన్ ను అసిస్టెంట్ కు ఇవ్వగా.. అతడు ఫోన్ మాట్లాడాడు. తనకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చిందని.. జియోకు సంబంధించిన ఉత్పత్తులు 50శాతం ఆఫర్ తో ఇప్పిస్తానని నమ్మపలికాడు. రూ.2.50లక్షల విలువైన జియో వస్తువులను కేవలం రూ.1.25లక్షలకే ఇప్పిస్తానని అన్నాడు.

 

దాంతో జీవిత రాజశేఖర్ ఆ మోసగాడికి రూ.1.25లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ ఫర్ చేసింది. ఆ తర్వాత నుండి అతడు ఫోన్ ఎత్తడం మానేశాడు. మోసపోయినట్లు గుర్తించిన జీవిత రాజశేఖర్.. ఈ విషయం మీద సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీవిత రాజశేఖర్ ఫిర్యాదు ఆధారంగా సైబర్ పోలీసులు చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించి, అతడిని అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -