Keerthi Suresh: మహేష్ ఫ్యాన్స్ కు మండేలా కీర్తి కామెంట్లు.. ఏమైందంటే?

Keerthi Suresh: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు సైతం అభిమానించే హీరో ఎవరంటే రానా పేరే వినిపిస్తుంది. రానా.. హైట్, వెయిట్, స్టైల్‌కి ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ ఈవెంట్‌లో చెప్పాడు. మొదట్లో తనతో పని చేసే హీరోయిన్లు తన కాంటాక్ట్ నంబర్ తీసుకుని.. ఆ తర్వాత రానా ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగేవారని అన్నాడు. అలా టాలీవుడ్ హంక్‌గా రానా గుర్తింపు పొందాడు. లేడీ ఫ్యాన్స్ ఫాలొయింగ్‌తోపాటు హీరోయిన్ల క్రేజ్‌లోనూ రానా అందరూ హీరోల కంటే ముందే ఉన్నాడు. పెళ్లికి ముందే ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రేమాయణం కూడా నడిపించాడు. పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

 

 

టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరో ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. కీర్తి సురేష్ కూడా మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించింది. అయినా తనకు నచ్చిన హీరో ఎవరనే అడిగితే మాత్రం రానా పేరును టక్కున చెప్పేసింది. అలాగే మోస్ట్ కూల్ పర్సన్ ఎవరని అడగగా.. రానా పేరునే సూచించింది. ఇదంతా రానా ఎదురుగా ఉన్నప్పుడే జరిగింది. దాంతో రానా కూడా షాకయ్యాడు. తన పేరును ఇంకా చెప్పకని రానా.. కీర్తి సురేష్‌కు హింట్ ఇచ్చినా పట్టించుకోలేదు. రానా పేరును పలకరిస్తున్న ప్రతీసారి మురిసిపోయింది. అభిమానం అంటే ఇలానే ఉంటుందెమో అన్నట్లుగా కీర్తి వ్యవహరించింది. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కీర్తి సురేష్ కామెంట్లపై మండిపడుతున్నారు. కాగా, కీర్తి-రానా కలిసి జోడీగా ఎప్పుడు సినిమా చేయబోతున్నారో వేచి చూడాలి. ‘విరాట పర్వం’ తర్వాత రానా కొత్త సినిమాలకు ఓకే చెప్పలేదు. కమర్షియల్ హిట్ కొట్టేందుకు తగిన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -