Puri: పూరీ ఆస్తులపై ఆకాశ్ పూరీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Puri: ఇండస్ట్రీలో మాస్ ప్రేక్షకులను, క్లాస్ పాత్రలను సృష్టించిన ఘనత పూరి జగన్నాథ్ దర్శకత్వానిదే. తన ఊర మాస్ డైలాగులతో, తనదైన శైలిలో సీన్ లను క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసేవారు. మహేష్, పవన్, ఎన్టీఆర్, బన్నీ.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. వారందరికీ ఇండస్ట్రీ హిట్స్ అందించాడు. అయితే ఈ మధ్య పూరి హిట్స్ పొంది చాలా రోజులే అయ్యింది.

ఇటీవల వచ్చిన లైగర్ సినిమా..
దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో పూరి ఇమేజ్ పూర్తిగా మసకబారిపోయింది. అయితే ఇటీవల విడుదలైన లైగర్ మూవీతో తన ఇమేజ్ ను అలా పూర్తిగా చెరిపేసుకున్నాడు. దీనితో వరుసగా మళ్ళీ మూవీలు ప్లాన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ మాస్ డైరెక్టర్. అప్పట్లో చాలా మందిని గుడ్డిగా నమ్మడం వల్ల తన ఆస్తులను పోగొట్టుకున్నాడు పూరి. ఇక ప్రస్తుతం ఈ అంశంపై చర్చ విస్తృతంగా జరుగుతోంది.

తాను ఇతరులను నమ్మి ఎన్నో రకాలుగా మోసపోయిన విషయాల గురించి పూరి ఇది వరకు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. అయితే ఈ విషయం గురించి తాజాగా ఆకాశ్ స్పందించాడు. ఇక ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి వచ్చాకనే నాన్న గురించి పూర్తిగా అర్ధమయ్యింది అని ఆకాశ్ తెలిపాడు.

“మా ఆస్తులు పోవడానికి కారణం మా నాన్న కొందరిని అతిగా నమ్మడమే.. కొంతమంది స్నేహితులను నమ్మి గుడ్డిగా మోసపోయాడు. చాలామంది ఆయన్ను అడ్డంగా బుక్‌ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అందులో కొందరు ఆడవారు కూడా ఉండవచ్చు” అని వాపోయాడు ఆకాశ్‌ పూరీ. అయితే నాన్న సొంత ట్యాలెంట్‌ తో తిరిగి చాలా సంపాదించాడు.. అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -