Crime: మహిళలను అలా హింసించిన యువకుడు.. పరిగెత్తించి మరి?

Crime: రోజురోజుకీ దేశవ్యాప్తంగా దొంగతనాల కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దొంగతనాల కోసం దొంగలు వినూత్న ప్రయత్నాలు చేస్తూ బరితెగిస్తున్నారు. ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం మహిళల మెడలో గొలుసులు లాక్కోవడం మహిళలను బెదిరించి వారి దగ్గర ఉన్న వస్తువులు లాక్కోవడం ఇలా అనేక రకాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ మహిళను దొంగ బెదిరించి ఆమె మెడలోని గొలుసుని లాక్కెళ్ళాడు. పక్కనే ఉన్న మరొక యువకుడి సెల్ ఫోన్ ని కూడా లాకెళ్ళాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

తాజాగా ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని గజియాబాద్‌ లోని ప్రాంతానికి చెందిన ఓ మహిళ సోమవారం పగలు ఎండ కోసం ఇంటి బయటకు వచ్చి నిలబడింది. చలి విపరీతంగా ఉండటంతో వెచ్చదనం కోసం ఆ మహిళ ఎండలో సేద తీరడం కోసం అలా ఇంటి బయట నిలబడింది. ఇంతలోనే ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె మెడలో ఉన్న గొలుసు ఇవ్వమని అడగగా అతని చేతిలో ఉన్న గన్ను చూసి ఆమె భయపడి పోయింది. దాంతో ఆమె అక్కడ నుంచి ఒక సరిగా పరుగులు తీసింది. అయినప్పటికీ అతడు ఆ మహిళను వెంబడిస్తూనే ఉన్నాడు.

 

ఆమె వెంటే పరిగెత్తుతూ ఆమెను చంపుతామని బెదిరించడంతో ఆమె భయపడి పోయింది. ఈ క్రమంలోనే మహిళ అతను మెడలో ఉన్న గొలుసును తీసి అక్కడే కిందపడేసింది. వెంటనే దొంగదాన్ని తీసుకొని పరారవుతూ పక్కనే ఉన్న మరొక యువకుడు దగ్గరికి వెళ్లి అతడికి గన్ గురి పెట్టి సెల్ ఫోన్ ఇవ్వమని బెదిరించాడు. అతడు సెల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో అతని దగ్గర నుంచి లాక్కొని వెంటనే పరారయ్యాడు. ఇక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా అక్కడ దగ్గరలో ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -