Prabhas: ఆ వంటకాన్ని రుచి చూపించిన బాహుబలి.. మర్యాద మారలేదుగా!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అందరికీ గుర్తుకొచ్చే మరో విషయం ఏంటంటే ఆయనో భోజన ప్రియుడు అని. ఆయన తినడమే కాదు పక్కన వాళ్లకి కూడా కడుపు నిండా భోజనం పెట్టే గుణం ఆయనకు ఉంది. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆయన చూపించే మర్యాద గురించి చాలా సార్లు చెబుతూ ఉంటారు. తాను ఎక్కడ, ఎవరి షూటింగ్స్ లో ఉన్నా కూడా ఇంటి నుంచి భోజనం తెప్పించి మరీ పెడతారు. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

నందమూరి హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 షోకు ప్రభాస్ వెళ్లాడు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ అన్ స్టాపబుల్2 షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు సంబంధించి మొదటి సీజన్ బాగా హిట్ అయ్యింది. రెండో సీజన్ లో ఇప్పటికే పలువురు కుర్ర హీరోలు సందడి చేశారు. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. గతవారం కూడా దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబులు వచ్చి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

 

తాజాగా అన్ స్టాపబుల్2 షోకు ప్రభాస్ విచ్చేశారు. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలై లైకుల వర్షంతో దూసుకుపోతోంది. ఇందులో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు. అటు బాలయ్యను, ఇటు ప్రభాస్ ను చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లు చాల్లేదు. మరి ఈ సందర్భంగా ప్రభాస్ బాలయ్యకు పలు రకాల వంటలు చేయించారు.

 

బాలయ్య కోసం ప్రభాస్ స్వయంగా మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ చేయించాడట. అద్భుతమైన రుచులను బాలయ్యకు ప్రభాస్ చూపించాడట. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ప్రభాస్ తానే స్వయంగా మటన్ బిర్యానీని చేసి రుచి చూపించినట్లు సమాచారం. ఎంతైనా ప్రభాస్ భోజన ప్రియుడు కదా. అద్బుతమైన మటన్ బిర్యానీని రుచి చూపడంతో బాలయ్య తెగ ఆనందపడినట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -