Poorna: తాడులతో కట్టేసి అలా చేయడంతో పూర్ణ నరకం చూసిందట!

Poorna: సినీ ఇండస్ట్రీలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అనుకునే విధంగా పనులు జరగవు. సినిమా పూర్తయ్యేంత వరకు డైరెక్టర్లు, నిర్మాతల చేతిలో కీలుబొమ్మలగా ఉండాల్సిందే. అలాంటిదే నటి పూర్ణ జీవితంలో జరిగింది. ఎవరూ ఊహించని విధంగా కెరీర్ డౌన్‌లోకి వెళ్లినా.. తిరిగి పికప్ చేసుకుంది. ప్రస్తుతం పూర్ణ పెళ్లి చేసుకుని భర్తతో మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ‘సీమటపాకాయ్’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అయితే డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో విడుదలైన ‘అవును’ సిరీస్ మంచి హిట్ అయింది. అప్పట్లో డైరెక్టర్ రవిబాబుకు పూర్ణ మధ్య ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో రవిబాబు-పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని రవిబాబు చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా రవిబాబు ‘ఆలీతో సరదాగా’ టాక్ షోకి పాల్గొన్నారు. ఇందులో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, సీక్రెట్స్ రివీల్ చేశాడు. ఈ క్రమంలో పూర్ణ విషయంలో జరిగిన తప్పును ఓపెన్‌గా చెప్పేశాడు.

 

 

ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. ‘నటి పూర్ణ నా దర్శకత్వంలో చాలా సినిమాలు చేసింది. అప్పట్లో మా ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచిందని పుకార్లు వినిపించాయి. కానీ మా మధ్య ఉంది డైరెక్టర్-హీరోయిన్ రిలేషన్‌షిప్. అయితే ఏ డైరెక్టర్‌కి అయినా చీప్ రేట్‌కి దొరికే హీరోయిన్ కావాలి. నేను అదే చేశాను. అయితే పూర్ణ నా వల్ల చాలానే బాధ పడింది. ‘అవును’ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణ నా వల్ల చాలానే బాధ పడింది. ఈ సినిమా కోసం ఏనుగుతో ఆమెను పట్టుకున్న ఫోటో కావాలి. ఆ ఫోటో కోసం చాలా విధాలుగా ప్రయత్నించాం. ఫోటో షూటింగ్ కోసం పూర్ణను తాడుకు కట్టేసి గంటపాటు వేలాడదీశాం. ఫోటో తీసేటప్పుడు కెమెరామెన్ పొరపాటు చేశాడు. కెమెరాలో చిప్ పెట్టడం మర్చిపోయాడు. ఈ విషయం బయటికి చెప్తే గోల జరుగుతుందని మెల్లగా నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆ విషయాన్నే పూర్ణ దగ్గరికి వెళ్లి చెప్పాను. అప్పుడు ఆమె కోపంతో ఊగిపోయింది. ఆమె కోపంలో అర్థం ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. దీంతో మళ్లీ గంట పాటు తాడుకు కట్టేసి పూర్ణ వేలాడదీయాల్సి వచ్చింది. పాపం చాలా నొప్పిని భరించింది. కెమెరామెన్ చేసిన చిన్న తప్పుకి పూర్ణ బలైంది.’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, అదే సంతోషకరమైన విషయమని పూర్ణ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -