Madhubala: ఆ పెళ్లైన హీరో అంటే ఈ హీరోయిన్ కు ప్రాణమట!

Madhubala: అప్పట్లో అందాల తారగా హీరోయిన్ మధుబాల పేరు తెచ్చుకుంది. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడచక్కని అందంతో పాలరాతి శిల్పంలా ఉంటుంది. ఒకప్పుడు అందాల తార అంటే ఐశ్వర్యరాయ్ అనే వారు. ఆమెతో అందంలో పోటీపడేది ఎవరైనా ఉన్నారంటే అది మధుబాలే అని అనేవారు. ఆ రోజుల్లో మధుబాల స్టార్ హీరోల సరసన నటించారంటే చాలు చాలా మంది ఆమెను చూడ్డానికే థియేటర్లకు వెళ్లేవారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తున్నారు.

 

సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మధుబాల రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం అందుకుంటోందని సమాచారం. తాజాగా ఆమె ప్రేమ దేశం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరని ప్రశ్నించగా దానికి ఆమె బదులిచ్చారు. ఇప్పుడున్న హీరోయిన్స్ లల్లో తనకు సాయి పల్లవి అంటే బాగా ఇష్టమని చెప్పారు. డ్యాన్స్ పరంగానూ, యాక్టింగ్ పరంగానూ సాయి పల్లవి చాలా చక్కగా నటిస్తోందని తెలిపారు.

 

ఇక హీరోల విషయానికి వస్తే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, తనకు ఆమె వీర అభిమాని అని వెల్లడించారు. అదేవిధంగా ఈ తరం కుర్ర హీరోలలో మాత్రం నాగచైతన్య అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. మధుబాలు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మాటలకు అటు అక్కినేని అభిమానులు, ఇటు పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆమె పలు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ కనిపించనున్నట్లు తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -