Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే ఆశీర్వదించాలని కోరుతున్నారు అయితే ఈమె 2014 -2019 సంవత్సరాలలో నగరి నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
ఇక 2019వ సంవత్సరంలో వైసిపి అధికారంలోకి రావడంతో మంత్రి పదివి కూడా దక్కించుకున్నారు. ఈ విధంగా ఈమెకు మంత్రి పదవి రావడంతో నగరి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా అక్రమాలకు దోపిడీలకు పాల్పడ్డారు. ఇది ఏంటని ప్రశ్నిస్తే వారిని అసభ్య పదాలతో తిడుతూ మీడియా సమావేశాలలో మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఈమె నోటిని చూసి చాలామంది ఆమెతో మనకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి సైతం నగరి నియోజకవర్గంలో రోజాకు టికెట్ ఇస్తే గెలవదని తెలిసినప్పటికీ తన నోటికి భయపడే ఆమెకు టికెట్ ఇచ్చారని చెప్పాలి. అయితే 2019 ఎన్నికల ముందుకు వరకు కూడా రోజా భారీ స్థాయిలో అప్పలపాలు అయ్యారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయితే 2019 ఎన్నికల ముందుకు వరకు కూడా రోజా భారీ స్థాయిలో అప్పలపాలు అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో దోపిడీలకు తెర తీశారు.
పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేయటం ఇసుక దోపిడీ చేయడం ద్వారా భారీ స్థాయిలో డబ్బు సంపాదించారు. తన భర్త తన సోదరులు మొత్తం ప్రతి మండలంలోనూ పెత్తనం చెలాయిస్తూ వసూళ్లను రాబట్టేవారు. ఇలా అప్పుల పాలు అయినటువంటి రోజా అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కోట్లు కూడ పెట్టారు. చెన్నై బెంగళూరు హైదరాబాద్ విజయవాడ వంటి ప్రాంతాలలో ఇల్లు ఇంటి స్థలాలను కొనుగోలు చేశారు. అలాగే ఖరీదైన బెంజ్ కార్లను కొనుగోలు చేశారు అయితే ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తే తాను సినిమాలలో చేశానని చెబుతున్నారు అప్పుల పాలైనటువంటి రోజా ఇలా ఉన్నఫలంగా వంద కోట్లు ఎలా సంపాదించారనేది నగరి ప్రజలకు స్పష్టంగా తెలుసు కనక ఈసారి అక్కడ ఆమె గెలుపు నల్లేరు పై నడకలాగా సాగుతుందని చెప్పాలి.