Naga Chaitanya-Samantha: కలిసిపోదామని కోరిన నాగచైతన్య.. సామ్ ఒప్పుకుంటుందా?

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ మాజీ స్టార్ కపుల్స్ నాగచైతన్య-సమంత గురించి అందరికీ తెలిసిందే. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో ప్రేమలో పడ్డ వీరిద్దరూ.. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించుకుని ఒక్కటయ్యారు. కొన్నేళ్లపాటు వీరి జీవితం సాఫీగానే సాగింది. కానీ ఏమైందో తెలియదు.. గతేడాది ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు. వీరిద్దరూ విడిపోతున్నారని ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు. వీరు విడిపోయి ఏడాది గడుస్తున్నా.. వీరిద్దరి మధ్య ఏదైనా రూమర్స్ రావడం సెన్సెషనల్‌గా మారుతున్నాయి. సమంత తనదైన శైలిలో నాగ చైతన్య గురించి మాట్లాడుతూ వచ్చింది. కానీ అక్కినేని ఫ్యామిలీ ఇప్పటివరకు ఆమె గురించి ఎక్కడా మాట్లాడినట్లు దాఖలాలు లేవు.

 

 

ఇటీవల సమంత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడింది. అప్పుడు సమంత త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ పరిశ్రమ మొత్తం తన యోగక్షేమాలు తెలుసుకుంది. సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేశారు. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అధికారికంగా స్పందించలేదు. దాంతో అక్కినేని ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు సమంత-నాగచైతన్య విడిపోవడానికి నాగార్జున కారణమని ప్రచారం జరిగింది. సమంత నాగార్జునను తీవ్ర స్థాయిలో అనుమానించిందని, అందుకే అంత కఠినంగా ఉంటున్నట్లు సమాచారం.

 

ఏది ఏమైనా సమంత-నాగచైతన్య తిరిగి కలవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఎప్పటికైనా కలవకపోతారా? అనే ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత-నాగచైతన్య మళ్లీ కలిసిపోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నాగ చైతన్యనే ప్రపోజల్ పెట్టాడని, కానీ సమంత నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదని సమాచారం. అయితే సమంతకు కూడా నాగచైతన్య అంటే ఇష్టం. ఒకవేళ నాగ చైతన్య కలిసిపోవాలని ప్రతిపాదన చేసినట్లయితే.. సమంత ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Ys Bharathi Reddy: పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్...
- Advertisement -
- Advertisement -