Unstoppable: టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్’. సీజన్-1 సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో సీజన్-2 కొనసాగిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, పొలిటికల్ లీడర్లతో బాలయ్య చిట్ చాట్ చేసిన ఎపిసోడ్స్ నెట్టింట ట్రెండింగ్గా నిలిచాయి. తాజాగా కొత్త ఎపిసోడ్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే పవన్ కళ్యాణ్తోపాటు డైరెక్టర్లు త్రివిక్రమ్, క్రిష్ కూడా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎపిసోడ్ ముగింపులో త్రివిక్రమ్, క్రిష్ రానున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య-పవన్ కళ్యాణ్ను ఒకేసారి తెరపై చూడబోతుండటంతో ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు బాలయ్య.. పవన్ కళ్యాణ్కు ఎలాంటి ప్రశ్నలు వేస్తాడా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ వ్యక్తిగత విషయాలను అడుగుతారా?, సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారా? రాజకీయాల గురించి అడుగుతారా? అనే ఉత్కంఠత నెలకొంది. ఇలాంటి క్రమంలో తాజాగా మరో పుకారు వినిపిస్తోంది. ఆహా సమర్పణలో అన్స్టాపబుల్ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ను గెస్టుగా తీసుకురావడానికి అల్లు అరవింద్ ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే.. పవన్ షోలోకి అడుగు పెడుతున్నారా? అని ప్రజలు షాక్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే స్టార్ హీరోలు ప్రభాస్-గోపిచంద్కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమోలో ప్రభాస్లో కొత్త యాంగిల్ను చూడబోయే ఛాన్సులు కనిపిస్తున్నాయి. స్టేజ్పై చాలా తక్కువగా మాట్లాడే ప్రభాస్.. అన్స్టాపబుల్లో మాత్రం చాలా ఓపెన్అప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఎపిసోడ్పై భారీ అంచనాలే పెరిగాయి. ఈ ఎపిసోడ్ ట్రెండింగ్లో దూసుకెళ్లడం ఖాయమని అన్స్టాపబుల్ టీమ్ చెబుతున్నారు.