tollywood: ఈ ఏడాది అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమా ఇదే!

tollywood: సినిమాలు ఎన్నెన్నో వస్తున్నా అందులో విజయం సాధించేవి కొన్నే ఉన్నాయి. మిగిలినవి పర్వాలేదనిపిస్తున్నాయి. మరికొన్ని అయితే డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే ఈ ఏడాది 2022 ముగిసిపోతోంది. కొత్త సంవత్సరం 2023 వస్తోంది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి.

 

భారీ అంచనాల మధ్య విడుదలైన డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. దాదాపు ఈ ఏడాది అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల పాటు థియేటర్లు అంతగా సందడిగా కనిపించలేదు. థియేటర్ల మూతతో సినిమా ఇండస్ట్రీ చాలా దారుణంగా పడిపోయింది. అనేకమంది ఈ ఫీల్డ్ ని వదిలేశారు. కరోనా తర్వాత 2022లో సినిమా ఇండస్ట్రీ కొంత ముందుకు సాగిందని చెప్పాలి. అయితే ఓటీటీల ప్రభావం కూడా ఉండటంతో కాస్త థియేటర్లకు ఇబ్బంది ఎదురైందని చెప్పాలి.

ఈ ఏడాది టాలీవుడ్ లో కేజీఎఫ్2, బింబిసార, ఆర్ఆర్ఆర్, కార్తికేయ వంటి సినిమాలు విజయవంతం అయ్యాయి. వీటికి ప్రజాదరణ బాగుంది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఇవి ముందు వరుసలో నిలిచాయి. అలాగే ఈ ఏడాది చివరలో విడుదలైన అవతార్ 2 సినిమా కూడా కాసులు రాబట్టింది. అయితే కథ మాత్రం అంతగా ఎవ్వరికీ కనెక్ట్ కాలేదు.

 

ఇకపోతే ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయిన సినిమాల్లో రాధేశ్యామ్ ముందు వరుసలో నిలుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆ తర్వాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అటు బాలీవుడు, ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -