Ahmedabad: అల్మరాలో కూతురు శవం, బెడ్ కింద తల్లి శవం.. అసలేం జరిగిందంటే?

Ahmedabad:దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు, మానభంగాలు, మానసిక వేధింపుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై ఇలాంటి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. గుజరాత్ అహ్మదాబాద్ పరిధిలోని భూలాభాయ్ ప్రాంతంలో హాస్పిటల్ ఉంది. అయితే ప్రాంతానికి చెందిన భవాని, చంపా అనే తల్లి, కూతురు దంత సమస్య చికిత్స చేసుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్లారు. అయితే సాయంత్రం అయిన ఇద్దరూ ఇంటికి చేరుకోలేదు.

 

దీంతో ఖంగారుపడ్డ ఆ మహిళ కుమారుడు ఆస్పత్రిలో వారి గురించి విచారించిన వారి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. కాగా ఇటీవల అదే హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ లో అల్మారా నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అక్కడి నర్సులు ఏంటా అని తెరిచి చూడగా అందులో యువతి శవం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం మరో గదిలో బెడ్ కింద మరో మహిళ మృతదేహం కనిపించడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

 

అయితే వారిద్దరినీ ఎవరో కావాలనే గొంతు పిసికి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. పోలీసులు వెంటనే ఆస్పత్రిలో ఉన్నసీసీ కెమెరాలను పరిశీలించగా ఆ సమయంలో అవి పని చేయలేదని తెలుసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం సైతం ఆస్పత్రికి చేరుకుని నమూనాలను తీసుకున్నారు. చనిపోయిన ఆ తల్లి కూతురికి అనిస్థిషియా ఇచ్చి తల్లీకూతుళ్లను హత్య చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అనంతరం యువతి శవాన్ని అల్మారాలో ఉంచి, తల్లి శవాన్ని మంచం కింద వదిలేసి పరారయ్యారని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -