Tollywood: ఈ రెండు పాటలలో ఏ పాట ఫ్యాన్స్ కు నచ్చిందంటే?

Tollywood: ఈ సంక్రాంతికి సినీ సందడి మొదలైంది. అటు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, ఇటు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ రెండు సినిమాల నుంచి ఇటీవలే పాటలు కూడా విడుదలయ్యాయి. సినిమాల నుంచి వస్తున్న ప్రతి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాల్లీరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలైంది. అలాగే వీరసింహారెడ్డి సినిమా నుంచి మా బావ మనోభావాలు అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.

 

రెండు సినిమాల నుంచి విడుదలైన రెండు పాటలూ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. బాస్ పార్టీ అనే పాటకు దేవిశ్రీ సరికొత్త ట్యూన్ ప్లస్ అయ్యిందనే చెప్పాలి. అలాగే మా బావ మనోభావాలు సాంగ్ కు థమన్ ట్యూన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రెండు పాటల ట్యూన్స్ క్యాచీగా ఉండగా లిరిక్స్ కూడా అద్భుతంగా వచ్చాయంటూ ఆడియన్స్ సందడి చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులకు బాస్ పార్టీ సాంగ్ నచ్చగా ఊరమాస్ ప్రేక్షకులకు మా బావ మనోభావాలు సాంగ్ తెగ నచ్చేసిందని చెప్పాలి.

 

విడుదలైన ఈ రెండు పాటలలో ఒక పాట ఎక్కువని మరో పాట తక్కువని చెప్పలేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండు పాటలు కూడా అద్బుతంగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్, థమన్ తమ బెస్ట్ వర్క్ ఇచ్చారని పాటలను చూస్తుంటేనే అర్థమైపోతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా దేవిశ్రీ, థమన్ జాగ్రత్తలు తీసుకుని పాటలకు ట్యూన్స్ కట్టినట్లు తెలుస్తోంది.

 

2020 సంక్రాంతికి ఒక్కరోజు గ్యాప్ లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో అనే రెండు సినిమాలు విడుదలై మంచి విజయం సాధించాయని చెప్పాలి. ఆ విధంగానే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -