Nagababu-Roja: రోజాపై ఫైర్ అయిన నాగబాబు.. అలా చెప్పడంతో?

Nagababu-Roja: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత, మంత్రి రోజా. నగరి ఎమ్మెల్యేగా, ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నీమధ్యన మాట్లాడుతూ.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదు అందుకే ప్రజలు వాళ్లను ఓడించారు అని వ్యాఖ్యానించింది. అయితే రోజా వ్యాఖ్యల మీద మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

 

మంత్రి రోజా ఇతరుల మీద విమర్శలు చేయడం మానుకోవాలని జనసేన నేత నాగబాబు హితవు పలికారు. రోజాకు కౌంటర్ ఇస్తూ.. ‘ఇతరుల మీద విమర్శల వర్షం కురిపించడం మానుకొని.. ఇక ముందు పర్యాటక శాఖ అంటే ఏమిటో తెలుసుకో.. పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటి అనేవి తెలుసుకోవాలి’ అని నాగబాబు సలహా ఇచ్చారు. పర్యాటకంలో ఏపీ ర్యాంక్ పడిపోయిందని, ముందు పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

 

మరోపక్క చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల గురించి రోజా మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ.. ‘రోజా ఎన్ని రోజులు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినా నేను రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఒకటే కారణం రోజా నోటికి మున్సిపాలిటీ కుప్ప తొట్టికి పెద్ద తేడా లేదు, అని నేను భావించడం వల్లే’ అని నాగబాబు పేర్కొన్నారు.

 

‘చూస్తూ చూస్తూ ఎవరూ మునిసిపాలిటీ కుప్ప తొట్టిని కెలకరు, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖ మీద దృష్టి పెట్టి ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో’ అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘రోజా, నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా?’ అనే పేరుతో నాగబాబు నిమిషం 45 సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియోని షేర్ చేసి ఆమెను టార్గెట్ చేశారు. కాగా దీనిపై రోజా ఎలాంటి రివర్స్ ఎటాక్ చేస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -