Samantha: చాలా రోజులు తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతులం ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కు సామ్ హాజరు అయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గుణశేఖర్.. ఈ మూవీకి సమంతానే నిజమైన హీరో అని కొనియాడాడు. అయన మాటలతో ఒక్కసారిగా భావోద్వేగ్యానికి గురైన సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. శాకుంతలం చిత్ర ప్రొమోషన్స్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంది. ఆమెకు మయోసైటిస్ వ్యాధి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఫంక్షన్ ద్వారా మీడియా ముందుకు వచ్చింది. జీవితం లో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ సినిమాలు తనకు ఎంతో ప్రేమ అని తెలిపింది. ఆ ప్రేమతోనే శాకుంతలం సినిమా చేశానని.. ఈ మూవీ విజువల్ వండర్ గా ఉండనుందని వెల్లడించింది.
ఈ చిత్రంలో తన పాత్ర సినిమా ఆద్యంతం రసవత్రంగా ఉంటుందని చెప్పింది. ఈ పాత్ర ఎంతో కష్టపడి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా అంది. ఎన్నో రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సామ్.. చేతిలో జపమాల పెట్టుకుంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడ్తున్న సమంత జపమాల చేతిలో పెట్టుకోటం వెనుక చికిత్సకు సంబదించిన కారణాలు ఉన్నాయి అని తెలుస్తోంది.
మయోసైటిస్ వ్యాధితో బాధపడ్తున్న సమంత.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం జపమాల వాడుతుంది అని సమాచారం. జపమాల చేతిలో ఉంటె ఎపుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటది అని అందుకే సామ్ కూడా అది వెంటే పెట్టుకుంది అని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తీవ్ర ఆరోగ్య సమస్య ఉన్నపటికీ ఎంతో ఓపికగా శాకుంతలం సినిమా చేసిందని.. సమంత కోసం అయినా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని సినీ జనాలు కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ చిత్రంలో సామ్ నటిస్తుంది.
📸💕🌟 pic.twitter.com/CHofJcMgWR
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) January 9, 2023