Sultanpur: మూఢనమ్మకాలకు మరొకరు బలి.. కొడుకుని పారతో కొట్టి చంపిన తల్లి?

Sultanpur: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కొత్తలు తొక్కుతుండగా మరొకవైపు మాత్రం మారుమూల పల్లెటూర్లలో మూఢనమ్మకాలు మాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రజల మూఢనమ్మకాలను నమ్మడంతో పాటు వాటిని ఆచరిస్తూ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. కొందరు అయితే మూఢనమ్మకాల బారిన పడి చంపడానికి చావడానికి అయినా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే మూఢనమ్మకాల బారిన పడి ఎంతో మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక తల్లి మూఢ నమ్మకాలను నమ్మి ఏకంగా కన్న కొడుకునే హత్య చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ప్రాంతంలో మంజూ అనే మహిళ భర్తతో నివసిస్తోంది.

 

అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఆ మహిళ భర్తతో బాగానే ఉంది. కాగా మంజూ ఇటీవల ఆరు నెలల కిందట ఓ కుమారుడికి జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కూడా సంతోషించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి మంజు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇటీవల ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది. ఆ మాంత్రికుడు మాయ మాటలు నమ్మి గుడ్డిగా ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. మూఢనమ్మకాల పేరుతో మంజూ తన 6 నెలల కుమారుడిని చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడిని పారతో దారుణంగా కొట్టి చంపింది.

 

ఇదే సమయంలో ఆ బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంజూ ఇంట్లో వెళ్లి చూడగా ఆ బాలుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు ఏం జరిగిందని ఆ మంజూను నిలదీయగా అసలు విషయం చెప్పడంతో కంగుతిన్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -