Shaakuntalam: శాకుంతలం సినిమా కష్టాలను చెప్పుకున్న స్టార్ హీరోయిన్

Shaakuntalam: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తాజాగా ఆమె ముంబయి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఆమె చాలా తగ్గిపోయారని, బక్కపల్చగా తయారయ్యారని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేశాయి. తాజాగా ఆమె శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కానుంది.

 

సమంత యశోధ సినిమా సమయంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటూనే ఆమె యశోధ సినిమాకు డబ్బింగ్ చెప్పి అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఆమె మీడియా కంట కనిపించకపోయినా గత కొద్ది రోజుల నుంచి ఆమె గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె అక్కినేని హీరో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె గురించి పలు వార్తలు నెట్టింట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.

 

అటు నాగచైతన్య, ఇటు సమంత ఫ్యాన్స్ కు వారిద్దరూ విడిపోవడం అంతగా ఇష్టం లేదు. అందుకే వీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా శాకుంతలం సినిమా షూటింగ్ విశేషాలను సమంత పంచుకున్నారు. ఈ సినిమాలో తాను ఒకే భంగిమలో ఉంటూ హావభావాలు కూడా ఒకేలా పెట్టడం కష్టంగా అనిపించిందని సమంత చెప్పుకొచ్చారు.

 

ఏడ్చినప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా ఒకే రకంగా ఉంటూ హావభావాలు పలికించడం కాస్త కష్టంగా అనిపించిందని, అందుకోసమే తాను ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని నెట్టింట ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తనకు అలా కష్టంగా అనిపించినప్పుడు తన కుక్కను కూడా తీసుకెళ్లాల్సి వచ్చిందని, ఈ సినిమాకు ఏడ్వటం కూడా చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. సమంత మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -