Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లోనే ఆయన పేరు మీద దాదాపు రెండు వేల అభిమాన సంఘాలు ఉండేవని, ప్రతి ఏడాదీ ఆయన పుట్టిన రోజును ఆ సంఘాలన్నీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవనీ తెలుసు. ఇక ఆయన తర్వాత వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబుకు కూడా అదే విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తండ్రికి తగ్గ కొడుకుగా మహేశ్ బాబు సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తున్నాడు. కృష్ణ చనిపోవడం అందర్నీ బాధించింది. మహేశ్ బాబు కూడా తన తండ్రి మరణం పట్ల చాలా బాధపడ్డారు. అప్పుడు మహేశ్ ను చూసి బాధ పడ్డ వారంతా ఇప్పుడు అదే మహేశ్ బాబును తిడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కృష్ణ చనిపోయిన రోజు రాత్రి సమయంలో ఆయన పార్థివ దేహం వద్ద ఒక్కరు కూడా లేరని, అంత్యక్రియలు కూడా తెల్లారి కావడంతో మహేశ్ ఫ్యామిలీ మొత్తం వారి ఇంటికి వెళ్లి పడుకుందని, ఇక కృష్ణ పార్థివ దేహం నరేశ్ ఇంట్లోనే ఉన్నా కూడా నరేశ్ మాత్రం అక్కడ లేడని ఆమె వీడియోలో తెలిపింది. కృష్ణ చనిపోయిన రాత్రి రమ్య రఘుపతి, ఇంకొందరు కానిస్టేబుళ్లు మాత్రమే అక్కడ ఉన్నారని, అదే విషయాన్ని ఆమె వీడియో తీసి మరీ చూపించడంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.
రమ్య రఘుపతి షేర్ చేసిన ఆ వీడియో చూసిన వారంతా మహేశ్ బాబు మీద, నరేశ్ మీద సీరియస్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. తమ అభిమాన నటుడిని అలా వదిలేస్తారా అంటూ తిట్టిపోస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృష్ణ చనిపోయి రెండు నెలలు కూడా కాక ముందే మహేశ్ బాబు వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేయడంపై కూడా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.