Tollywood: ఈ హీరోయిన్ పుట్టుమచ్చను చూస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. సామాన్యుల దగ్గరి నుంచి స్టార్ల వరకూ కూడా అందరూ సోషల్ మీడియా వేదికగా ఎక్కువ సమయం గడుపుతున్నారు. తమ జీవితంలో ఏది జరిగినా కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నటీనటులు తమ ఛాలెంజ్ లతో ఫాలోవర్స్ తో అనేక విషయాలను షేర్ చేసుకుంటున్నారు.

 

నెట్టింట సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను కూడా చెబుతూ ఫ్యాన్స్ తో తెగ ముచ్చటిస్తుంటారు. అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన ఫోటోలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ఏకంగా తన పుట్టుమచ్చనే చూపించి వార్తల్లో నిలిచింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలోని హీరోయిన్ దిశా పటాని తన పుట్టుమచ్చను చూపిస్తూ నెట్టింట వైరల్ అవుతోంది.

 

దిశా పటాని సినీ ఇండస్ట్రీలో తన అందంతో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు ఆమె పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ కు ఆమె పరిమితం అయ్యింది. ఇక అక్కడే సెటిల్ అయిన ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ లతో, తన బికినీ అందాలతో నెటిజన్లు, ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.

 

ఇదిలా ఉంటే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో నెటిజన్లతో ‘ఆస్క్ మై ఎనీథింగ్‘ అంటూ పలు విషయాలను షేర్ చేసుకుంది. అభిమానులు తన ఇష్టాఇష్టాల గురించి ప్రశ్నించగా ఓ అభిమాని ఆమెను మరో ప్రశ్న వేసి ఆశ్చర్యపరిచాడు. దానికి ఆమె తన పుట్టుమచ్చను చూపించి షాక్ ఇచ్చింది. ఇతరులకు, మీకు ఉన్న తేడా ఏంటి అని ఆ అభిమాని ప్రశ్నించగా వెంటనే ఆమె తన కంటిని జూమ్ చేసి ఫోటో తీసి షేర్ చేసింది. తనకు కంటి కింద పుట్టుమచ్చ ఉందంటూ ఆ ఫోటో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది. ప్రస్తుతం దిశా పటాని ‘రాధే‘ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమా మే 13వ తేదిన రిలీజ్ కానుంది.

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -