NTR-Allu Sirish: ఎన్టీఆర్ ను అవమానించడం అల్లు శిరీష్ కు అవసరమా?

NTR-Allu Sirish: తెలుగు సినిమా కీర్తి ఇప్పుడు ఎల్లలు దాటింది. దర్శక ధీరుడు రాజమౌళి తన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ను పెంచగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఖండాంతరాలు దాటి తెలుగు కీర్తిని చాటాడు. తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను కైవసం చేసుకోవడంతో.. అంతర్జాతీయ మీడియాసైతం మన తెలుగు సినిమా గురించి చర్చించుకుంటోంది.

 

ఇండియా నుండి మరీ ముఖ్యంగా సౌత్ నుండి వచ్చిన ఓ సినిమా తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకోవడంతో.. దేశ ప్రధాని దగ్గరి నుండి ప్రతి ఒక్కరు అభినందనలు తెలిపారు. ఆస్కార్ అవార్డులకు ఎంట్రీగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట దక్కించుకోవడంతో.. ఈ సినిమా ఆస్కార్ బరిలో ఖచ్చితంగా ఉందనే సంకేతాలు అందుతున్నాయి.

 

‘ఆర్ఆర్ఆర్’ టీం భారతీయత ఉట్టిపడేలా రెడీ అయి అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా కీర్తిని మరింత రెట్టింపు చేశారు. అయితే ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గురించి ప్రముఖ సింగర్ రెహన్నా దగ్గరి నుండి మన దేశ ప్రధాని, ఏపీ సీఎం, ప్రతిపక్ష నేతలు ఇలా చాలామంది ట్విట్టర్ ద్వారా తమ అభినందనలు తెలిపారు. అయితే ఈ మొత్తంలో అల్లు శిరీష్ చేసిన ఓ పని నందమూరి అభిమానులకు కోపం తెప్పిస్తోంది.

 

‘ఆర్ఆర్ఆర్’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ అల్లు శిరీష్ కూడా ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ లో దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటుడు రామ్ చరణ్ ల ట్విట్టర్ హ్యాండిల్స్ ని ట్యాగ్ చేశాడు. కానీ ఎన్టీఆర్ ని మాత్రం మర్చిపోయాడు. దీంతో కావాలనే అవమానించేలా అల్లు శిరీష్ ఈ పని చేశాడని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -