Jharkhand: భర్తను చంపి.. మృతదేహంతో 5 రోజులు గడిపిన మహిళ?

Jharkhand: తాజాగా ఝార్ఖండ్ లో ఒక ధారుణమైన ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టిన భర్తను చంపిన ఒక మహిళ అనంతరం భర్త మృదేహంతో పాటు ఐదు రోజులు అలాగే గడిపింది. అసలేం జరిగిందంటే. ఝార్ఖండ్ రాష్ట్రం జంషేడ్ పూర్ పట్టణంలో సుభాష్ కాలనీలో అమర్నాథ్ సింగ్, మీరా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లన కొంతకాలం పాటు ఈ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా కలిసిమెలసి జీవించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు పూణెలో ఉంటున్నాడు.

 

అయితే కొంతకాలం నుంచి మీరా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుండేవారు. ఈ కారణంతోనే ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే గొడవ జరిగిన ప్రతిసారి మీరా కోపంతో ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేస్తూ చాలా రచ్చ రచ్చ చేసేది. ఇరుగుపొరుగు వారు నచ్చే ప్రయత్నం చేసిన వాళ్లతో కూడా గొడవపడేది. అలా రాను రాను ఆ దంపతుల గొడవలు చూసి స్థానికులకు కూడా అలవాటైపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల ఐదు రోజుల నుంచి అమర్నాథ్ సింగ్ కనిపించడం లేదు.

ఇంట్లో నుంచి కూడా ఎవరు బయకు రావడం లేదు. అయితే దంపతులు ఇద్దరు ఊరికి వెళ్లి ఉంటారని అందరు భావించారు. కానీ ఇటీవల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా మీరా తలుపు తెరచి వారిని తిడుతూ అక్కడి నుంచి వెళ్లగొట్టింది. అంతేకాక తన ఇంటిలోకి ఎవరు రాకుండా ఉండాలని చుట్టూ ఉన్న కంచెకు కరెంటు పెట్టింది.
దాంతో స్థానికులు ఎవరూ ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేదు. అప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అలానే నిందితురాలని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -