Jharkhand: కూతురి మృతదేహంతో ప్రియుడు ఇంటి ముందు 30 గంటల పాటు అలా?

Jharkhand: ఇటీవల కాలంలో అమ్మాయిల పరిస్థితి.. ప్రేమిస్తే ఒక బాధ ప్రేమించకపోతే ఒక బాధ అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. ప్రేమించేవరకు ప్రేమించమంటూ వెంటపడడం మించిన తర్వాత పెళ్లి అనుమానం గొడవలు అంటూ చంపేయడం లాంటివి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత అసలు నిజ స్వరూపాన్ని చూపిస్తూ రాచిరంపాలు పెడుతూ చివరికి చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇంకొంతమంది పెళ్లి మాట ఎత్తి సరికి తప్పించుకొని తిరగడం లేదంటే చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది.

ప్రాణంగా ప్రేమించానని అన్నాడు. కానీ చివరకు అతనే ప్రియురాలిని కడతేర్చి ఏమీ ఎరగన్నట్లు నాటకం ఆడాడు. ఆ విషయాన్ని ప్రియురాలి తల్లి గ్రహించి ఏకంగా ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కూతురు మృతదేహంతో సిద్ధ్‌గోడా బాగున్‌హటు రోడ్‌ నెం 5లో నివాసం ఉంటున్న ఆమె ప్రియుడు వికాస్‌ దత్తా ఇంటికి ముందు నిరసన చేపట్టింది. వికాసే తన కుమార్తెను చంపి, నదిలో పడేసి చంపేశాడని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపణలు చేసింది. ఆమెను నది దగ్గరకు పిలిచి, మొబైల్ లాక్కొని, ఆపై హత్య చేసి చంపేశాడంటూ మృతురాలి తల్లి పేర్కొంది.

 

పోలీసులు వచ్చి కేసు నమోదు చేసే వరకు శవాన్ని తీయనంటూ, అంత్యక్రియలు నిర్వహించనని మొండికేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బంధువులకు లభించడంతో అది హత్యేనని 30 గంటల పాటు ఆమె ధర్నాకు దిగింది. ఆమె ఒంటిపై గాయాల గుర్తులు ఉన్నట్లు తెలిపింది. స్థానికులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి ఆమె వినలేదు. అప్పటికే శవాన్ని తీసుకువచ్చి కొన్ని గంటలు గడిచిపోవడంతో పాటు దుర్వాసన కూడా వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమికుడు వికాస్‌ దత్తా, అతని తండ్రిని పోలీసులు గురువారం జైలుకు పంపారు. సాయంత్రం ఐదు గంటలకు మృతురాలి సోదరుడు, స్థానిక నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎఫ్ఐఆర్ కాపీని, అతని తండ్రిని జైలుకు పంపిన రుజువును అందించారు. అనంతరం ప్రేమికుడి ఇంటి వద్ద ధర్నాకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తొలగించి అంత్యక్రియలు నిర్వహించారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -