Nadhiya: అక్కడ పుట్టుమచ్చ ఉంటే తిరుగులేదా.. నదియాకు లక్ అంటూ?

Nadhiya: ఒకప్పుడు హీరోయిన్లుగా చేసిన చాలా మంది నటీమణులు ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ రెండో ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటూ అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే హీరోలకంటే హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ట్రెండే నడుస్తోంది. గత ఐదారేళ్ల నుంచి కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అలాగే పాత హీరోయిన్లు అమ్మ క్యారెక్టర్లు, సపోర్టింగ్ రోల్స్ లోకి వస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతున్నారు.

ఇలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు నటి నదియా. ఈమె తమిళంలో అప్పట్లో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. తాను నటించిన మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు. మలయాళం, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ మూవీస్ చేశారు. రెండు ఇండస్ట్రీలో ఎంతో మంది సూపర్ స్టార్స్ తో నటించారు.

 

1994లో నదియా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత 2004లోనే మళ్లీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తల్లి క్యారెక్టర్లు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో ఆమె నటించారు. అలాగే వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ సినిమాలోనూ ఆమె నటించారు. ఈ సినిమాలకు గాను ఆమెకు అవార్డులు కూడా వరించాయి.

 

ఇకపోతే నటి నదియా సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది. ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఆమె నడుముపై పుట్టుమచ్చ అని, ఆ పుట్టుమచ్చ వల్లే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -