Balayya: గుండె సమస్యలకు చెక్ పెట్టే దిశగా బాలయ్య నిర్ణయం.. ఏం జరిగిందంటే?

Balayya: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. ఇకపోతే ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాలయ్య బాబు దిగిన వారికి అడగని వారికి ఎంతో మందికి సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే.

కొన్ని వందలాది మందికి ఉచితంగా వైద్యాన్ని చేయించి గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్పటికీ వైద్యాన్ని చేయిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే దివంగత హీరో నందమూరి తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకి ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అన్న ఉద్దేశంతో హిందూపురంలో తాను ను నిర్మించిన హాస్పటల్ లో హెచ్ బ్లాక్ కి తారకరత్న పేరు పెట్టారు. అలాగే పేదలకు వైద్యం కోసం కోటీ 30 లక్షల రూపాయల విలువ చేసే సర్జికల్ పరికరాలను ఏర్పాటు చేయిస్తూ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు బాలయ్య బాబు.

 

అదేవిధంగా ఈ ఆసుపత్రిలోనే చిన్నపిల్లలకి ఉచిత భోజనంతో పాటు కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు జై బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అది కదా బాలయ్య అంటే బాలయ్య ఈస్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -