NTR: వాడి దెబ్బకు నా భార్య బలి.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడంతో పాటు ఆస్కార్ అవార్డు ని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇకపోతే టాలీవుడ్ లో ఉన్న హీరోలలో చాలామంది సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తనకు సంబంధించిన పనులు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ సినిమాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక ప్రైవేటు థియేటర్ లో చూసాము. అప్పుడు అమ్మ దూరంగా వేరే వరుసలో కూర్చుంది.

 

నా ఇంట్రడక్షన్ సీన్ చూసి దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొంది. పక్కనే కూర్చొని నా చేయి పట్టుకొని సినిమా చూసింది. ఆ ఫీలింగ్ నాకెప్పటికి మర్చిపోలేనిది అని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. అనంతరం తన కొడుకు అభయ్ గురించి మాట్లాడుతూ..అభయ్ కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. వాడికి ఏదైనా కనిపిస్తే వెంటనే దాని గురించి ప్రశ్నలు వేస్తాడు. అన్నింటికి ఓపిగ్గా సమాధానాలు చెబుతాను. ఒక్కోసారి వాడేం అడుగుతాడో అన్న భయం వేస్తుంది. అందుకే వాణ్ని చూసి పారిపోతుంటాను.

 

అప్పుడప్పుడు వాడి దెబ్బకు ప్రణతి బలైపోతుంటుంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు తారక్. పెళ్లికి ముందు చాలా హైపర్ గా ఉండేవాడి. కానీ అలాంటి నన్ను లక్ష్మీ ప్రణతి మార్చేసింది అని తెలిపారు ఎన్టీఆర్. నా భార్యను గౌరవిస్తా. నన్ను చాలా మార్చేసింది. మా ఇంటి హోమ్ మినిస్టర్ మాట తప్పక వింటా పాటిస్తాను అని చెప్పుకొచ్చారు తారక్.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -