Manchiryal: ప్రేమ వ్యవహారం.. మరొక యువకుడు బలి?

Manchiryal: ఇటీవల కాలంలో చాలా మంది మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి ఎదుటి మనుషులను దారుణంగా హత్య చేయడం పొడిచి చంపడం లాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. మరి ముఖ్యంగా కుల పిచ్చితో చాలామంది ప్రేమించిన యువతీ యువకులను దారుణంగా చంపడానికి వెనకాడడం లేదు. ఈ మధ్యకాలంలో చాలావరకు ప్రేమ వ్యవహారం మోజులో పడి చాలామంది యువకులు ప్రాణాలను మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రేమ వ్యవహారంలో అమ్మాయిలు సేఫ్ అవుతుండగా అబ్బాయిలు మరణిస్తున్నారు.

 

తాజాగా ప్రేమ వ్యవహారానికి మరో యువకుడు కూడా బలయ్యాడు. ఈ దారుణమైన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండల గూడెం గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తోంది. అయితే అతని కూతురు మేనల్లుడు దుడ్డంగుల అనిల్ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆ యువతి తండ్రి అనిల్ ని పలుసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అనిల్ తన ఆలోచన విధానాన్ని మర్చిపోకుండా ఆ యువతీని అలాగే ప్రేమించసాగాడు. దాంతో ఎలా అయినా అనిల్ ని చంపాలి అని నిర్ణయించుకున్నాడు అతని మేనమామ.

 

ఈ నేపథ్యంలోనే మేనల్లుడిని మాట్లాడదామని పిలిపించాడు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోని మోదెల చెట్ల సమీపానికి చేరుకోగానే మేనల్లుడిని కత్తితో బెదిరించాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న గడ్డిమందు కలిపిన బీర్ మేనల్లుడు అనిల్ తో బలవంతంగా తాగించాడు. స్పృహ తప్పగానే అనిల్ మేనమామ అక్కడి నుండి పరారయ్యాడు. వెంటనే అటుగా వెళుతున్న స్థానికులు అనిల్ ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అనిల్ మొబైల్ లో చనిపోక ముందు మాట్లాడిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కూతురు తప్పు చేస్తే కూతుర్ని కూడా మందలించాల్సింది పోయి ఏకంగా అల్లుడి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -