Bhuma Mounika: వైరల్ అవుతున్న భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలు!

Bhuma Mounika: భూమా మౌనిక ప్రస్తుతం మంచు ఇంటి కోడలుగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.మంచు మనోజ్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నటువంటి మౌనిక మార్చి మూడవ తేదీ తనని పెళ్లి చేసుకొని మంచు కోడలుగా అడుగుపెట్టారు.ఇలా మనోజ్ మౌనిక వివాహం జరిగిన తర్వాత వీరిద్దరు జంటగా పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలా మొదలైంది కార్యక్రమంలో ఈ దంపతులు హాజరయ్యి వారి వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా భూమా మౌనిక మాట్లాడుతూ మంచు మోహన్ బాబు గారు చాలా సరదాగా ఉంటారని ఈమె తెలియజేసారు.ఒకసారి పెళ్లి కాకముందు వారి ఇంటికి వెళ్ళగా మామయ్య తనకు స్వయంగా భోజనం తినిపించారని మౌనిక వెల్లడించారు. నన్ను నా కొడుకును సొంత మనుషులుగా వారు దగ్గరకు తీసుకున్నారని మౌనిక ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక తన అత్తయ్య గురించి మాట్లాడుతూ మా అమ్మ చనిపోయినప్పుడు అత్తయ్య గారు తనకు ఎంతో ధైర్యం చెప్పారని మౌనిక తెలిపారు.

 

ఇప్పుడు కూడా అత్తయ్య ప్రతిరోజు తనకు ఫోన్ చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారని ఆమె నన్ను కోడలిగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటున్నారని తెలియజేశారు.ఇలాంటి ఒక మంచి కుటుంబంలోకి నేను కోడలుగా అడుగుపెట్టడం నిజంగా ఆ దేవుడిచ్చిన వరం అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యారు. ఇక మంచు లక్ష్మి గురించి కూడా మౌనిక పలు విషయాలను తెలియజేశారు.

 

మంచు లక్ష్మితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు ఆమె తనను ఒక చిన్న పిల్ల మాదిరిగానే చూసుకుంటుందని కామెంట్లు చేశారు. ఇక భూమా మౌనిక ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో ఈమె రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనస్సాక్షిగా చెప్పాలంటే తాను రాజకీయాలలో ఉన్నానని, జనాలతో మమేకం కావడమే తనకు ఇష్టమని అవసరమైతే జనాల కోసం నిలబడతానని, రాజకీయం అంటే మాకు ఒక బాధ్యత అంటూ మౌనిక ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -