Dance: డ్యాన్స్ వల్లే క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు వీళ్లే!

Dance: సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులు వచ్చాయి. సినిమా అంటే ఒకప్పుడు కేవలం హీరో ఒరియంటెడ్ గా మాత్రమే నడిచేది. ఈ ట్రెంట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హీరోలకు సమాన స్థాయిలో హీరోయిన్లు వచ్చేసారు. వారంతా కాకపోయినా ఇంచు మించు అదే విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాలో పాత్రలు కూడా అలాగే ఉంటున్నాయి.

డాన్సులు కూడా హీరోలతో సమానంగా ఇరగదీస్తున్నారు.

ఒకప్పుడు స్టార్ హీరో మూవీ అంటేనే హీరోయిన్లతో ఎక్కువ పని ఉండదు. వారి సినిమాలలో సాంగ్ వచ్చే కొన్ని క్షణాల లేదా నిముషాల ముందు హీరోయిన్ కనిపిస్తే చాలన్నట్టుగా, ఇక పాటల్లో స్కిన్ షో చేస్తే సరిపోతుంది. హీరోయిన్లకు డాన్స్ చేసే అవకాశం కూడా తక్కువే. ఒకవేళ డాన్స్ వచ్చినా కూడా ఎంతమంది ఆ ఛాన్స్ ని వాడుకుంటారో తెలీదు.

ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇక్కడే అసలు విషయం ఉంది. తాజాగా ‘ధమాకా’ సినిమా విడుదలైంది. ఈ మూవీ రొటీన్ గానే ఉన్నా, శ్రీలీల కోసం అయిన ఒకసారి చూడాలి అనే టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజకు సమానంగా ఆమె మాస్ స్టెప్పులతో ధియేటర్లలో ఈలలు వేయించింది. హీరోయిన్ శ్రీలీల మాత్రమే కాకుండా ఆమెలానే కొంతమంది హీరోయిన్లు కూడా తమ డాన్స్ తో భారతీయ సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు.

 

మాధురి దీక్షిత్.. ఈ బాలీవుడ్ హీరోయిన్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. మాధురి దీక్షిత్ డాన్స్ తో ఆకట్టుకుంది. ఊర్మిళ నటించిన ‘రంగీలా’ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధాన కారణం ఆమె చేసిన డాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రపంచ సుందరి తన అందంతోనే కాకుండా తన డాన్స్ తోను ఆకట్టుకుంది.

 

రాధ.. తెలుగు తెర పై మెగాస్టార్ చిరంజీవితో సమానంగా డాన్స్ చేయయగల హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే వినిపించే పేరు రాధ. అతిలోక సుందరి శ్రీదేవి అందంతోనే కాక తన డాన్స్ తో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమానే ఊపేసింది. తమన్నా డాన్స్ ఎంత బాగా చేస్తుందో ఆడియెన్స్ కి తెలిసిందే. అందానికి డాన్స్ తోడైతే ఎలా ఉంటుందో తమన్నాను చూస్తే అర్దమవుతుంది. శృతి హాసన్, సాయి పల్లవి శ్రీలీలలు బెస్ట్ డాన్సర్లుగా రాణిస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -