Karnataka: భార్యను కాదని మరో మహిళతో అలాంటి పని.. చివరికి?

Karnataka: సమాజంలో రోజురోజుకీ వివాహేతర సంబంధాల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి చాలామంది పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడడం లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న భార్యను చంపడం లేదంటే తాళి కట్టిన భర్తను చంపడం లాంటివి ఎక్కువ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక తిరువళ్లూరు జిల్లా ఒండికుప్పం గ్రామానికి చెందిన ప్రసాద్‌ అనే 28 వ్యక్తికి పడపై ప్రాంతానికి చెందిన సమీప బంధువైన భవాని అనే 24 మహిళతో 2019లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర బాబు కూడా వున్నాడు. ప్రసాద్‌ శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి అదే కంపెనీలో పనిచేసే కవిత అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. అయితే ప్రసాద్ బాగోతం అంతా ఆ భార్య భవానికి తెలిసింది. దాంతో ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడి సంవత్సరం నుంచి వేరుగా వుంటున్నారు.

 

అయితే రెండు వారాల క్రితం భవానీకి ఫోన్‌ చేసిన కవిత, తనకు ప్రసాద్‌కు మూడు నెలల క్రితం వివాహమైందని, తాను ప్రస్తుతం మూడు నెలల గర్భవతినని చెప్పింది. విషయం విన్న వెంటనే భవానీ షాక్‌కు గురయ్యింది. వెంటనే భర్తను కలిసి ఆ విషయం గురించి భర్తను నిలదీయగా అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తప్పు చేయడమే కాక.అది నేరమే కాదన్నట్లు మాట్లాడిన భర్త మాటలు భవానిని కుంగదీశాయి. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన భవాని తాజాగా ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై భవాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేశారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -