Karnataka: ఆ విషయంలో భర్తతో గొడవ పడిన మహిళ.. చివరికి?

Karnataka: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలికి చిలికి గాలి వానగా కూడా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమంది ఆవేశంలో ఒకరినొకరు చంపుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు పిల్లలు బలవుతున్నారు. భార్యాభర్తలు పోట్లాడుకోవడం ఆవేశాన్నంత పిల్లలపై చూపించడం వారిని చంపడం లాంటి చేస్తున్నారు. తాజాగా అలాంటి దారుణానికే ఒక ఒడిగట్టింది ఒక తల్లి. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఈ ఘటన కర్ణాటకలోని జరిగింది. గిరనహళ్లికి చెందిన సుగుణకు కోలార్ తాలూకాలోని ఉప్పకుంటె గ్రామానికి చెందిన మురళీతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రభుత్వ రవాణా సంస్థ కోలార్‌లో పనిచేస్తున్నారు. మురళీ సెక్యూరిటీ గార్డుగా, భార్య సుగుణ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. వీరికి 9 ఏళ్ల ప్రీతంగౌడ, 6 ఏళ్ల నిషిత గౌడ పిల్లలు ఉన్నారు. అయితే భార్యా భర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల సుగుణ తండ్రి చనిపోవడంతో పుట్టింటికి కుటుంబ మొత్తం వెళ్లారు. తిరిగి వచ్చి అందరూ పడుకుని నిద్రపోయిన తరువాత భర్త మురళీని లేపింది సుగుణ. పిల్లల హోంవర్క్ విషయంలో భర్తతో గొడవ పడింది.

 

ఆ విషయం గురించి ఇద్దరు వాదనలు చేసుకుంటుండగా కోపంతో ఊగిపోయిన మురళి సుగుణపై చేయి చేసుకున్నాడు. ఇక మరుసటి రోజు యథావిధిగా అతడు డ్యూటీకి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన వెంటనే ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి సుగుణ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరివేసి సుగుణ కూడా బలవన్మరణానికి పాల్పడింది. అంతకముందు సోదరుడికి వాట్సప్ సందేశాన్ని పంపింది. అదేవిధంగా డెత్ నోట్ కూడా రాసింది. తన చావుకు అత్త, భర్త కారణమంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడింది. ముగ్గురు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి చుట్టు ప్రక్కల వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను విచారిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -