Uttar Pradesh: ప్రియురాలు చేసిన మోసాన్ని తట్టుకోలేక చివరికి అలా?

Uttar Pradesh: ఈ మధ్యకాలంలో చాలామంది యువత ప్రేమ అనే ఒక పిచ్చి మోజులో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు టైం పాస్ కోసం ప్రేమిస్తున్నట్టు నటిస్తుండగా మరికొందరు మాత్రం నిజంగా ప్రేమించి అటువంటి వారి చేతిలో దారుణంగా మోసపోతున్నారు. తాజాగా ఒక యువతి కూడా అలాగే ఒకరిని ప్రేమిస్తూ మరొకరితో డేటింగ్ చేస్తున్నడంతో అది తెలుసుకున్న ప్రేమికుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని శివ నాడార్ యూనివర్సిటీలో అనూజ్ కుమార్ 23 ఏళ్ల యువకుడు స్నేహి అనే యువతి ఇద్దరు సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరిదీ ఒకే క్యాంపస్ కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు తరచూ మాట్లాడుకునేవారు. అలా వీరిద్దరూ కొన్నాళ్ళ పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి స్నేహ అతడిని ప్రేమిస్తూనే మరో యువకుడితో డేటింగ్ లో ఉన్నట్లు అనూజ్ కుమార్ తెలుసుకున్నాడు. ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉన్నాయి.

 

పిచ్చిగా ప్రేమిస్తే ప్రియురాలు తనని మోసం చేసిందని అనూజ్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దాంతో ఎలాగైన ప్రియురాలు స్నేహను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల అనూజ్ కుమార్ క్యాంపస్ లో ప్రియురాలిని కౌగిలించుకుంటున్నట్లుగా నటించాడు. ఇదే సమయంలో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో స్నేహను కాల్చి హత్య చేశాడు. అనంతరం అనూజ్ కుమార్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -