Hanmakonda: దారుణం.. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని అలా?

Hanmakonda: తాజాగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో సాయి చంద్ అనే 24 యువకుడు నివసిస్తున్నాడు. కాగా సాయి చంద్ గత కొంత కాలంగా స్థానికంగా ఒక హోటల్ ను నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే సాయిచంద్ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా ఇతడిని ప్రేమించింది. దీంతో ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. సాయిచంద్ ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. కానీ ఈ ఆ అమ్మాయి సాయిచంద్ ని కాదని మరో యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది.

ఈ విషయం తెలుసుకున్న సాయి చంద్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కానీ అతడు దీని కంటే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు సాయి. జులైవాడకు చెందిన గిన్నె విష్ణువర్ధన్ అనే వ్యక్తి ఈ నెల 17న ఆ అమ్మాయి ఉండే ప్రాంతానికి నన్ను పిలిపించుకుని నాపై దాడి చేశారు. దీంతో పాటు బాగా టార్చర్ చేశారని అని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారిని పిలిపించి ఎంక్వయిరీ కూడా చేయలేదని తెలిపాడు.

 

ఇక తాజాగా నేను ప్రేమించిన అమ్మాయి బర్త్ డే, అందుకే ఈ రాత్రి 12 గంటలకు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నా అని తెలిపాడు సాయి చంద్..ఎందుకుంటే ఆమే ప్రతీ ఏడాది చేసుకునే పుట్టిన రోజున నా చావు రోజని ఆమెకు గుర్తు రావాలని సాయి చంద్ తెలిపాడు. నేను చనిపోయాక నా శవాన్ని ఆ అమ్మాయికి చూపించండి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అక్క, బావా, అమ్మ, నాన్న నన్ను క్షమించండి, మీ అందరినీ మిస్ అవుతున్నా వాళ్లిద్దరినీ మాత్రం అస్సలు వదలొద్దు అంటూ సాయి చంద్ తన సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -