Nithiin: అయ్యో.. నితిన్ కు ఘోర అవమానం జరిగిందిగా?

Nithiin: ఈ మధ్యకాలంలో బీజేపీ నాయకులంతా.. టాలీవుడ్ హీరోలపై కన్ను వేశారు. మరి ఇలా ఎందుకు కన్నివేశారన్న దానిపై ఆన్సర్ లేదు కానీ.. ఇటీవలే విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన.. హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాదులో జూనియర్ ఎన్టీఆర్ ని కలిశాడు. ఈ విషయం మొన్నటి వరకు కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరి ఇదే క్రమంలో తాజాగా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హీరో నితిన్ ని కలిశాడు. ఇక నితిన్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమా కూడా తీయలేదు. అంతేకాకుండా తను నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు అయింది. మరి నడ్డా ఎందుకు నితిన్ ను కలిసాడు అన్నదానిపై చర్చనీయాంశం అయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

మరి సోషల్ మీడియాలో జరిగే వార్తలు ఏమిటంటే.. నిజానికి నడ్డా కలవాలనుకున్నది హీరో నిఖిల్ ని అట. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో సక్సెస్ అయ్యింది. అటు నార్త్ లో కూడా ఈ సినిమా బాగా సక్సెస్ ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో పురాణాలు.. మన చరిత్రను గురించి వివరించాయి. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

కాబట్టి నడ్డా హీరో నిఖిల్ ని కలిసి.. తనని ప్రశంసించాలనుకున్నారట. అయితే పేర్లు ఒకేలా ఉండడంతో తెలంగాణ బీజేపీ లీడర్స్ కన్ఫ్యూజ్ అయ్యి.. నడ్డా ముందు నిఖిల్ కి బదులు గా నితిన్ ని కూర్చోబెట్టారని తెలుస్తుంది. ఈ విషయం గురించి గ్రహించుకున్న నడ్డా.. తెలంగాణ బీజేపీ నాయకులపై మండిపట్టట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి హీరో నిఖిల్ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక నితిన్ మాత్రం ఈ విషయం తెలిసి.. ఒక్కసారిగా బిత్తరపోయినట్లు అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -