Surat: కూతురిని దారుణంగా హత్య చేసిన తండ్రి?

Surat: ప్రస్తుత సమాజంలో మనుషులు మానవత్వాన్ని మరిచి అతి దారుణంగా మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం అన్న మాట మరిచి ఎదుటి వ్యక్తులను అతి దారుణంగా పొడిచి చంపడం హత్య చేయడం లాంటివి చేస్తున్నారు. అలాంటి కొందరు నరరూప రాక్షసులు మన మధ్యనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి నరరూప రాక్షసుల భాగోతాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక తండ్రి అతి దారుణంగా కూతురిని 25 సార్లు పొడిచి హత్య చేశాడు.

అసలేం జరిగిందంటే.. ఈ దారుణ ఘటన సూరత్ లో చోటు చేసుకుంది. సూరత్ లోని సత్య నగర్ సొసైటీలో ఒక ఫ్లాటులో రామానుజ అనే వ్యక్తి భార్య, కూతురితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వేసవి కాలం కావడంతో ఉక్కపోత భరించలేక మేడపై పడుకుందామని భార్య, కూతురు అడిగారు. ఈ విషయంలో భార్య భర్తల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన రామానుజ కత్తి తీసుకువచ్చి తల్లిపై దాడి చేసే యత్నం చేశాడు. తల్లికి అడ్డుగా కూతురు రావడంతో మరింత కోపంతో అడ్డొచ్చిన కూతురుని అత్యంత పాశవికంగా 25 సార్లు పొడిచి చంపాడు.

 

దాడి చేసే సమయంలో తల్లి అడ్డు రావడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఇరుగు పొరుగు బంధించే ప్రయత్నం చేయగా వారిని కూడా గాయపరిచాడు. ఈ దారుణ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రామానుజ ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి జైలు కి పంపించారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -